తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.94 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 118 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. ఇదే సమయం లో 264 మంది కోలుకున్నారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,587 కు చేరుకోగా… 2,90,894 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,601 మంది కరోనాతో మృతి చెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.65 శాతంగా ఉంటే.. భారత్లో 96.9 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 2,092 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 723 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 17,686 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
previous post