telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ చిత్రంలో బాలీవుడ్ సీనియర్‌ నటుడు…

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తాజాగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో వున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటేస్ట్‌ అప్‌డేట్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ పవర్‌ ఫుల్‌ పొలిటీషియన్‌ క్యారెక్టర్‌ కోసం బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ను చిత్రబృందం సంప్రదించిందని టాక్‌. అంతేకాకుండా సంజయ్‌ దత్‌కు త్రివిక్రమ్‌ వీడియో కాలింగ్‌ చేసి స్టోరీ నెరేట్‌ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్‌ పాత్రకు సరిసమానంగా ఉండే పవర్‌ ఫుల్‌ పాత్ర కావడంతో సంజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్‌ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు తప్పక స్కోప్‌ ఉంటుంది. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌, పూజా హెగ్డేలను ఎంపిక చేశారని ఫిల్మ్‌వర్గాల సమాచారం. ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం.

Related posts