జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీకి మరో శుభవార్త చెప్పింది. ఏపీలో జనవరి 9న జనన్న అమ్మఒడి రెండో విడత సొమ్ములు ఖాతాల్లో జమచేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. అమ్మ ఒడి పొందేందుకు ఈ నెల 10 నుంచి 20 తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16-19 వరకు లబ్దిదారుల ప్రాథమిక జాబితా విడుదల చేస్తామని.. 20-24 మధ్య జాబితాలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 26న అమ్మ ఒడి లబ్దిదారుల తుది జాబితాను వెలువరిస్తామని… అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పథకం అందజేస్తామని మంత్రి సురేశ్ చెప్పారు. గతేడాది 43.54 లక్షల మంది లబ్దిదారులకు ఈ పథకం కింద రూ. 6336 కోట్లు పంపిణీ చేశామన్నారు. అటు టీచర్ల బదిలీ ప్రక్రియ కూడా పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. నాలుగు కేటగిరీలుగా విభజించి బదిలీలు చేపడుతున్నామని.. కొన్ని పాఠశాలల్లోని ఖాళీలు భర్తీ చేసేందుకే బదిలీ ప్రక్రియ చేపట్టామన్నారు.
previous post
next post


విజయ్ సేతుపతి సినిమాలో సమంత నటించడానికి అసలు కారణం ఇదే…!