హైదరాబాద్ మల్కాజిగిరిలో దారుణమైన ఘటన జరిగింది. కేరళకు చెందిన 44 ఏళ్ల లాలు సబాస్టియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్- RPFలో ASIగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా అతను మల్కాజిగిరిలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో పొరుగింట్లో నివసిస్తున్న పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను చంపుతానని బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులు కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న బాలికపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు సెబాస్టియన్. అయితే ఇటీవల బాధితురాలు తన తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి, కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడు సెబాస్టియన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో విచారణలో నేరం అంగీకరించాడు. సెబాస్టియన్ను కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. కాగా, 2017లో ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన మర్డర్ కేసులో సెబాస్టియన్ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతోంది. అయితే ఈ ఘటన పై మహిళా సంఘాలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
previous post
next post