దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం మనదేశం నియంతృత్వ పాలనవైపు అడుగులేస్తోందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
ప్రముఖులపై పెట్టడం పట్ల రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే మోదీపై ఎవరు వ్యాఖ్యలు చేసినా జైలుకెళ్లక తప్పేట్టులేదని వ్యాఖ్యానించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఏదో ఒక రూపంలో వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
కోమటిరెడ్డి అందుకే పార్టీ మారుతున్నారు.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు