బాలీవుడ్ ఖాన్లు షారూక్, సల్మాన్లు మరోసారి కలిసి స్క్రీన్పై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న షారూక్.. పఠాన్ అనే మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. వార్, బ్యాంగ్ బ్యాంగ్ మూవీల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ఇందులో దీపికా హీరోయిన్గా నటించనుండగా, జాన్ అబ్రహం విలన్గా కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సల్మాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సల్మాన్ 10 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు టాక్. కాగా ఈ మూవీతో పాటు రాజ్ కుమార్ హిరానీ, అట్లీ దర్శకత్వాల్లోనూ షారూక్ నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా సల్మాన్, షారుఖ్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో కూడా నటించారు. అంతేకాదు ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రలో కూడా మెరిశారు.
previous post