ఆఖరి రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. ద్రవ్యవినిమయ బిల్లును శాసనసభ, శాసనమండలి ఆమోదించనున్నాయి. సభ ప్రారంభం కాగానే ద్రవ్యవినిమయ బిల్లును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం బిల్లును సభ ఆమోదిస్తుంది.
అసెంబ్లీలో ఆమోదం పొందాక బిల్లు శాసనమండలికి వెళ్తుంది. అక్కడ చర్చ అనంతరం బిల్లును ఆమోదిస్తారు. శాసనమండలిలో మున్సిపల్, సివిల్కోడ్ బిల్లులను కూడా ఆమోదించనున్నారు. ఈ నెల 9న ప్రారంభమైన సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శాసనసభ పదిరోజుల పాటు జరిగింది. బడ్జెట్ పద్దులపై సుదీర్ఘంగా చర్చించి వాటిని ఆమోదించారు.