యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు నితిన్ మ్యారేజ్ నాడు రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె తిరిగి ప్రారంభమైంది. అంతేకాదు ఓ షెడ్యూల్ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు “రంగ్ దే”కి సంబంధించి ఒకే ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అందులో కొన్ని సన్నివేశాలతో పాటు పాటలు ఉన్నాయి. వాటిని ఇటలీలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. ఇక ఈ షూటింగ్ని పూర్తి చేసేందుకు ఈ వారంలోనే ఇటలీకి వెళ్లేందుకు ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇటలీలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వగా.. అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దీంతో రంగ్ దే టీమ్ ఇటలీ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను దుబాయ్లో జరపాలని మూవీ యూనిట్ భావిస్తోందట. అయితే భారత్లో కేసుల దృష్ట్యా దుబాయ్ కూడా ఆ మధ్యన పలు ఆంక్షలు విధించింది. ఇలాంటి సమయంలో మరి మిగిలిన ఒకే ఒక్క షెడ్యూల్ని రంగ్ దే టీమ్ ఎక్కడ పూర్తి చేస్తుందో చూడాలి.
previous post
next post
కాజల్, తమన్నాలాగా నేను మెథడ్ ఆర్టిస్ట్ను కాను… హీరో కామెంట్స్