భాగ్యనగరంలో దారుణం జరిగింది. బంజారా హిల్స్ అంబేద్కర్ నగర్లో అన్యం పుణ్యం ఎరుగని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు 50 ఏళ్ల వృద్ధుడు.. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే.. చెన్నయ్య అనే వృద్ధుడు ఇంటి పక్కనే ఉన్నవారితో స్నేహం పెంచుకున్నాడు.. ఆ ఇంట్లోని నాలుగేళ్ల చిన్నారిని చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు.. అయితే.. చిన్నారి తల్లి పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న నాలుగేళ్ల చిన్నారిపై కన్నేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. తల్లి పనినుంచి ఇంటికి తిరిగివచ్చేసరికి ఇంట్లో చిన్నారి లేకపోవడంతో.. ఇంటి పక్కల అంతా వెతికారు.. ఆ తర్వాత చెన్నయ్య ఇంటి నుంచి బయటకు వచ్చింది చిన్నారి .. తన కూతురు ఏడుస్తుండడంతో విషయం గమనించిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈలోపు అక్కడి నుంచి జారుకున్నాడు చెన్నయ్య. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న చెన్నయ్య కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
జగన్ నామినేషన్లు కూడా తెలంగాణలోనే వేస్తారా?: లోకేశ్