telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేటితో పదేళ్లు పూర్తి చేసుకున్న “వేదం”… కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్

Vedam

క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వేదం చిత్రం జూన్ 4, 2010న‌ విడుదలైన సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నేటితో ప‌దేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర బృందానికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. “నేటితో వేదం చిత్రం ప‌దేళ్ళు పూర్తి చేసుకుంది. అంద‌మైన ప్ర‌యాణంలో నాతో పాటు క‌లిసి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడు క్రిష్‌కి హృద‌య‌పూర్వక ధ‌న్య‌వాదాలు. మీ విజ‌న్‌, ప్యాష‌న్ న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. మ‌నోజ్‌, అనుష్క‌, మ‌నోజ్ భాజ్‌పాయ్‌, ఇత‌ర చిత్ర బృందం అంద‌రికి ధ‌న్య‌వాదాలు. కీర‌వాణి గారు, జ్ఞాన‌శేఖర్ గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. నన్ను న‌మ్మి నాతో సినిమా చేసిన అర్కా మీడియాకి మ‌నస్పూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను” అని బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Related posts