భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఈ ఏడాది అతిపెద్ద టెస్ట్ సిరీస్గా అవతరిస్తుంది. ఆతిథ్య జట్టు అయిన ఆస్ట్రేలియా 2018-19లో జరిగిన ఈ సిరీస్ లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని అలాగే ట్రోఫీని అందుకోవాలని చూస్తోంది. అయితే డిసెంబర్ 17న అడిలైడ్లో ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గత టెస్టు సిరీస్ లో ఇద్దరు కెప్టెన్ లు టిమ్ పైన్, విరాట్ కోహ్లీల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కోహ్లీ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియన్లు కోహ్లీని ద్వేషించటానికి ఇష్టపడుతారు.. అందులో తాను కూడా ఉన్నాను అని తెలిపాడు. కానీ ఒక అభిమానిగా నేను అతని ఆటను చూడటానికి ఇష్టపడతాను అని అన్నాడు. అతనితో నాకు ఎక్కువ అనుబంధం కూడా ఏమి లేదు. కేవలం టాస్ సమయంలో మాత్రమే కలుసుకుంటాము అని చెప్పాడు. ఒక మంచిఆటగాడు ఉన్నప్పుడు ఎప్పుడూ కొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుంది, మీరు ఇంగ్లాండ్, జో రూట్ లేదా బెన్ స్టోక్స్ తో ఆడేటప్పుడు అదే జరుగుతుంది. ఇది తరచుగా ఉత్తమ ఆటగాడు మీ జట్టు కొంచెం పైకి వెళ్తుంది బిట్, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు క్రీజులోకి వచ్చినప్పుడు తీవ్రత పెరుగుతుంది “అని పైన్ అన్నారు.
previous post
next post


జగన్తో కేసీఆర్ కొత్త బంధాలు: లక్ష్మణ్