జగన్ చేతుల మీదుగా 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం ఇందుకు వేదిక కానుంది. జగన్ గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి, విశాఖపట్నం విమానాశ్రయం మీదుగా 10.30 గంటలకు పైడివాడ చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద కొద్దిసేపు స్థానిక నేతలతో ముచ్చటిస్తారు. అనంతరం లే అవుట్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్కును ప్రారంభిస్తారు. లే అవుట్ స్వరూపాన్ని పరిశీలించిన అనంతరం మోడల్ గృహాల్ని లబ్ధిదారులకు అందజేస్తారు. తర్వాత పైలాన్ను ఆవిష్కరించి, భూ సమీకరణకు సహకరించిన రైతులతో మాట్లాడనున్నారు.
previous post