telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రేపు ఢిల్లీ కి ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ కి వెళ్లబోతున్నారు. 30 వ తేదీన జరుగనున్న జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో జగన్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రధాని, సీజేఐ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారం పై సెమినార్ ఉండనుంది. ఈ ఢిల్లీ పర్యటన లో ప్రధాని మోడీ తో భేటీ కాబోతున్నారని సమాచారం.

Related posts