telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీ వెళ్లి చీవాట్లు తినడం జగన్ కు ఆనవాయితీ: యనమల

Yanamala tdp

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు చేసి ఢిల్లీ వెళ్లి చీవాట్లు తినడం జగన్ కు ఆనవాయితీగా మారిందని యనమల అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కంటే తన కేసుల భవిష్యత్తే జగన్ కు ముఖ్యమని విమర్శించారు.

గత 16 నెలల్లో కేంద్రం నుంచి జగన్ ఏం సాధించుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 16 నెలల్లో రూ.1.28 లక్షల కోట్ల అప్పులు తేవడమే జగన్ రికార్డు అని దుయ్యబట్టారు. చంద్రబాబు 31 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులతో గిన్నిస్ రికార్డు నమోదు చేశారని, కానీ జగన్ నెలకు రూ.8 వేల కోట్ల అప్పులు తేవడంలో వరల్డ్ రికార్డు స్థాపించారని ఎద్దేవా చేశారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదాపై గగ్గోలు పెట్టిన వైసీపీ నోరు ఇప్పుడెందుకు మూతపడిందని యనమల ప్రశ్నించారు. ప్రత్యేకహోదా పేరెత్తడం జగన్ మర్చిపోయి 16 నెలలైందని విమర్శించారు.

Related posts