హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతంలో దారుణం జరిగింది. దుండిగల్ సురారం కాలనీలో కృషి స్కూల్ దగ్గర సూట్కేసులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంటనే వారు పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇది హత్యగానే పోలీసులు ప్రథమికంగా నిర్ధారించారు. చనిపోయిన మహిళను రామచంద్రపురం ప్రాంతానికి చెందిన వివాహితగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.