వైఎస్ జగన్ సోదరి షర్మిలకు తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, సినీ నటి విజయశాంతి మద్దతుగా నిలిచారు. వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం సాగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోందని విజయశాంతి అన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషంకక్కే సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
పురుషాధిక్యత ఎక్కువైన రాజకీయాల్లో మహిళలను అణగదొక్కాలని చూసే ఇటువంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయన్నారు. మరే మహిళకు ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనల పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
పార్టీ పిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు