telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇలాంటి పుకారు వార్తలను నమ్మకండి : విక్కీ కౌశల్‌

Vicky-Kaushal

లాక్‌డౌన్‌ను అతిక్రమించి పోలీసులకు పట్టుబడ్డాడని సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను విక్కీ కౌశల్‌ కొట్టిపారేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన విక్కీ ముంబై పోలీసులను ట్యాగ్‌ చేశారు. ‘లాక్‌డౌన్‌ను ఉల్లంఘించానని పోలీసుల చేతిలో తన్నులు తిన్నానని వస్తున్నవార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి పుకారు వార్తలను నమ్మకండి అవి అవాస్తవాలు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటినుంచి కాలు బయట పెట్టలేదు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఇలాంటి అబద్దపు వార్తలు ప్రచారం చేయకండి’. అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం విక్కీ తన కుటుంబంతో కలసి ముంబైలో క్వారంటైన్‌లో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అలుపెరగకుండా, నిస్వార్థంగా పని చేస్తున్న​ పోలీసులకు విక్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇంట్లో సరదాగా వంటలు చేస్తున్న ఫోటోలను, సోదరుడు సన్నీ కౌశల్‌ సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో తరచుగా షేర్‌ చేస్తున్నారు. అలాగే కరోనా పోరుకు ప్రధానమంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి కోటి రూపాయల విరాళం అందజేశారు.

 

View this post on Instagram

 

Make way for the latest entrant in the elite club of #TheOmeletteFlippers ! 🍳🏆 #chotikhushiyaan

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

Related posts