పోలీసులు మరో ఇద్దరు క్రికెటర్లను ప్రీమియర్ లీగ్ ఫిక్సింగ్ విషయంలో గురువారం అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లయ్యింది. బళ్ళారి మాజీ కర్ణాటక వికెట్ కీపర్-బాట్సమన్ టస్కర్స్ కెప్టెన్ సిఎం గౌతమ్, ఆయన టీమ్ సభ్యుడు అబ్రార్ ఖాజిని నగర సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. గత రెండు సీజన్లలోనూ కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కెపిఎల్)ను నిర్థారించడంలో చోటుచేసుకున్న అభియోగాలపై క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతున్నది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నదని ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నదని అడిషనల్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు.
హుబ్బళ్ళి వర్సెస్ బళ్ళారి మధ్య కెపిఎల్ 2019 ఫైనల్స్ను ఖరారు చేయడంలో ఇద్దరి ప్రమేయముందని పోలీసులు తెలిపారు. మ్యాచ్ సమయంలో నిదానంగా బ్యాటింగ్ చేయడానికి సంబంధించి రూ.20 లక్షలు వారు చెల్లించారని, బెంగుళూరు టీమ్పై మరో మరో మ్యాచ్ ఫిక్స్కు కూడా వీరు పాల్పడ్డారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. బెంగళూరు టీమ్ తరుపున ఆడాల్సిన నిశాంత్ సింగ్ షెకావత్ను అంతకుముందు నిర్బంధంలోకి తీసుకున్న నేపథ్యంలో గురువారం నాటి అరెస్టులు చోటుచేసుకున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.