తెలంగాణలో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఎదురవుతోంది. ఒక వైపు కాంగ్రెస్ నుంచి, మరో వైపు బీజేపీ నుంచి కొన్నిచోట్ల ఎదురు గాలి వీస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం లోక్ సభ స్థానం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రేణుక చౌదరిపై లక్షా 66 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే కావడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. అత్యధిక మెజారిటీతో ఖమ్మం నుంచి భారీ విజయం లభించడం టీఆర్ఎస్ శ్రేణులు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. నామా గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
previous post
కేసీఆర్ కీ ఇచ్చినప్పుడే ఈటల మాట్లాడుతారు: జగ్గారెడ్డి