సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు , మజ్లీస్ నేత అససుద్దీన్ ఒవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూకట్ పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పర్యటించారు. శ్రీకాకుళంలో ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ ఎన్నికల్లో వైసీపీకి తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తున్న విషయం తెలుస్తుంది . ఈ నేపథ్యంలో మాధవరం కృష్ణారావు ఏపీకి వచ్చారనే వాదనలు వినపడుతున్నాయి. కాగా మాధవరం కృష్ణారావు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాడానికే వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కేసుల మాఫీ కోసం గంటా వైసీపీ వైపు మొగ్గు: మంత్రి అవంతి