telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏపీలో ప్రచారం..?

ycp leaders appriciating trs mlas in
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే  టీఆర్ఎస్  ముఖ్య నేతలతో పాటు , మజ్లీస్ నేత అససుద్దీన్ ఒవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో కూకట్ పల్లి  టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పర్యటించారు. శ్రీకాకుళంలో ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 
ఈ ఎన్నికల్లో వైసీపీకి తెలంగాణలో అధికార పార్టీ  టీఆర్ఎస్  మద్దతుగా నిలుస్తున్న విషయం తెలుస్తుంది . ఈ నేపథ్యంలో మాధవరం కృష్ణారావు ఏపీకి వచ్చారనే వాదనలు వినపడుతున్నాయి. కాగా మాధవరం కృష్ణారావు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాడానికే వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related posts