రేపు ఏపీసీఎం జగన్ కడప జిల్లా ఇడుపులపాయలో జరిగే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్ కు నివాళులు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు.
అక్కడి నుంచి జగన్ విజయవాడ పయనమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.