కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ప్రభుత్వాలు, సెలబ్రెటీలు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఈ క్రమంలో ప్లాస్మా దానం చేసి కరోనా రోగులను ఆదుకోవాలని సైబరాబాద్ సిపి సజ్జనార్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా సజ్జనార్ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పలువురు ప్రముఖ నటులు ప్లాస్మా దానం చేయాలని కరోనా వారియర్స్ కు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి కరోనా రోగులను ఆదుకోవాలని ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేయడం వల్ల కరోనా వారియర్స్ కు ఎటువంటి హాని జరగదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
previous post
next post