ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వడగండ్ల వాన కురిసే అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు.
తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా తూర్పు విదర్భ వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి ఇందుకు కారణమని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. నిన్న కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల చిరుజల్లులు కురిసాయి.
చట్టాల సవరణపై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు: డీకే అరుణ