రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ సీఎం జగన్ ఎటువంటి చర్యలూ తీసుకోవట్లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ప్రజలను రక్షించాలన్న బాధ్యత కన్నా ఆయనకు అధికారదాహమే అధికంగా ఉందని దుయ్యబట్టారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. పాఠశాలలను మూసేస్తున్నాయని, జనాలు గూమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాయని నారా లోకేశ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పారు. ఇందుకు జగన్ ఇగోయే కారణమని మండిపడ్డారు. మరింత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన పడుతున్న తపన రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాలన్న దాని కంటే అధికంగా ఉందని విమర్శిస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.
సుమలత ఫేస్బుక్ బ్లాక్.. కుమారస్వామిపై ఫైర్