కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడితే, ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా యనమల ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ ఒప్పందాలను సమీక్షిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు.
పీపీఏలపై సమీక్ష చేపట్టవద్దని కేంద్రం ఎందుకు సూచించిందో సీఎం జగన్ అర్థం చేసుకోవాలని యనమల తెలిపారు. ఒకవేళ ఈ సూచనలను కాదని ముందుకు వెళితే తీవ్ర తప్పిదమే అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలను రాష్ట్రం పక్కన పెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని గుర్తుచేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం కూడా కేంద్రానికి ఉందని యనమల పేర్కొన్నారు.
చంద్రబాబు, జగన్ దొందూ దొందే: సీపీఐ నారాయణ