telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హక్కులను హరించడం అప్రజాస్వామికం: చంద్రబాబు

chandrababu

వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా కల్పించిందని, ఆ హక్కులను హరించడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. తప్పులను ఎత్తిచూపించే వాళ్ల నోళ్లు నొక్కేయాలనుకోవడం వైసీపీ సర్కారు పిరికితనానికి నిదర్శనం అనిట్వీట్ చేశారు.

కొన్నిరోజులుగా రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. చేసే పనుల పట్ల చిత్తశుద్ధి, నమ్మకం ఉంటే ఎందుకింత భయపడుతున్నారని వైసీపీ సర్కారును నిలదీశారు. అంతేకాదు, ఎప్పట్లాగానే ‘జగన్ ఫెయిల్డ్ సీఎం’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.

Related posts