telugu navyamedia
రాజకీయ

ఉగ్ర‌వాదుల‌కు స‌హ‌క‌రిస్తున్న వారిని  ఏరివేస్తా: కిషన్ రెడ్డి

kishan reddy mp

కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రిగా  సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి బాధ్య‌త‌లు చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాద కార్యకలపాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర‌వాదుల‌కు స‌హ‌క‌రిస్తున్న వారిని శాశ్వతంగా ఏరివేస్తాని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. నేష‌న‌ల్ సిటిజ‌న్ రిజిస్ట‌ర్ త‌యారిపై ప్ర‌ధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు.  ఎవ‌రు ప‌డితే వారు మన దేశంలో ఉండేందుకు ఇదేమి ధ‌ర్మ స‌త్రం కాదని చెప్పారు. 

భార‌తీయులెవరు? చొర‌బాటుదారులెవ‌ర‌నేది లెక్క త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు. గ‌తంలో బీజేవైఎం అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు సీమా సుర‌క్ష పేరుతో 25 రోజులు యాత్ర చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించిన హోంశాఖ‌కు మంత్రికావ‌డం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ‌లో బీజేపీని టీఆర్‌ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా తీర్చిదిద్దుతామన్నారు.  బీజేపీలో చేరేందుకు చాలా మంద్రి సంప్ర‌దిస్తున్నారని త్వరలో వారందరినీ పార్టీలోకి చేర్చుకుంటామని తెలిపారు.  

Related posts