జీనియస్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్గా పని చేసిన అరుణ్ ప్రశస్త్ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అరుణ్ ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేస్తూ.. “యంగ్ డైరెక్టర్, ఇంతకముందు నా దగ్గర పని చేసిన అసిస్టెంట్ అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గుండెలు పగిలే బాధని కలిగిస్తుంది. ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ తన హార్డ్ వర్క్తో కెరీర్లో ముందుకుసాగాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని శంకర్ ట్వీట్ చేశారు. రుణ్ ప్రశస్త్ తన బైక్ని లారీకి గుద్ధడంతో యాక్సిడెంట్ జరిగింది. కోయంబత్తూర్లోని మెట్టుపాల్యం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మంచి టాలెంట్ ఉన్న అరుణ్కి చిన్న వయస్సులోనే నూరేళ్ళు నిండడంతో ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోతుంది. అరుణ్ ప్రశస్త్ తన పేరుని వెంకట్ పక్కర్గా మార్చుకొని జీవి ప్రకాశ్ కుమార్, గాయత్రి సురేష్, సురేష్ మీనన్ , సతీష్ ప్రధాన పాత్రలలో 4జీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. సీవీ కుమార్ నిర్మించిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికీ చిత్రం రిలీజ్ కాకపోవడం గమనర్హం. అరుణ్ మృతితో కోలీవుడ్ మొత్తం షాక్కి గురైంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్దిస్తున్నారు.
Heartbroken by the sudden demise of the young director and my ex-assistant, Arun. You were always sweet, positive and hardworking. My prayers are forever with you and my deepest condolences to your family and friends.🙏 pic.twitter.com/ZA6kvfcYLj
— Shankar Shanmugham (@shankarshanmugh) May 15, 2020