telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సర్కార్ వారి పాట” స్టోరీ లీక్

SVP

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్త సమర్పణలో రూపొందనున్న ఈ మూవీలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనుండగా, థమన్ బాణీలు కడుతున్నారు. ఇటీవలే విడుదలైన ‘సర్కారు వారి పాట’ ప్రీ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో అతిత్వరలో సెట్స్ మీదకు రానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల నేపథ్యంలో మహేష్ అభిమానులు కోరుకునే విధంగా ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారట డైరెక్టర్ పరశురామ్. ఇందులో మహేష్ ఓ బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో కనిపించనున్నారట. బ్యాంకుకు కోట్ల రూపాయల సొమ్మును ఎగ్గొట్టాలని చూసిన ఓ బిజినెస్‌మెన్ నుంచి మహేష్ ఆ సొమ్మును ఎలా రాబట్టారనే ఇతివృత్తంతో ఈ కథను తనదైన కోణంలో చూపించనున్నారట పరశురామ్.

Related posts