అందాల చందమామ కాజల్ అగర్వాల్ దాదాపు ఏడేళ్ళ క్రితం తమిళ స్టార్ హీరో సూర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ ముద్దుగుమ్మ సూర్యతో జతకట్టనుందని తెలుస్తోంది. 2012లో “మాట్రన్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ జంట. తెలుగులో ఈ చిత్రం “బ్రదర్స్” పేరుతో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత కాజల్, సూర్య మళ్ళీ కలిసి ఏ సినిమా చేయలేదు. అయితే కోలీవుడ్ సమాచారం ప్రకారం సూర్య 39వ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపికైందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రానుందని చెబుతున్నారు. విశ్వాసం ఫేమ్ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బేనర్పై ఈ చిత్రం నిర్మితం కానుంది. కాజల్ ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. “కోమలి” అనే తమిళ చిత్రంతో మంచి హిట్ కొట్టిన కాజల్ రీసెంట్గా “రణరంగం” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
next post
అంతా నా విగ్రహాలు పెట్టుకోవాలి : నటి హేమ