telugu navyamedia
సినిమా వార్తలు

శృతి హాసన్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పదేళ్ళు పూర్తి

Shruthi-Hassan

క‌మ‌ల్ గారాల తనయ శృతి హాస‌న్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి నేటితో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శృతి హాస‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. “సినిమా వ్యాపారంలో న‌టిగా ప‌దేళ్ళు పూర్తి చేసుకున్నాను. ఇక్క‌డ నేను ఎంతో నేర్చుకున్నాను ఇందుకు ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు. నన్ను న‌మ్మిన వాళ్ళ కోసం బాగా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని ప్ర‌మాణం చేస్తున్నాను. ఈ బిజినెస్ అనేది ఒక కుటుంబం అని తెలుసుకున్నాను. ఇందులో మంచి ఉంటుంది,చెడు ఉంటుంది. కాని ఎక్కువ శాతం ఎదుగుద‌ల‌, ఆశ‌, త‌ప‌న‌ అనేవి ఉంటాయి. నేను న‌టిగానే కాదు మ‌నిషిగాను చాలా మారాను. సంవ‌త్స‌రం గ్యాప్ తీసుకున్న నేను నా వృత్తితో పాటు నా వ్య‌క్తిగ‌త ల‌క్ష్యాల‌ని స‌రైన దారిలో పెట్టుకోవ‌డం చాలా అవ‌స‌రం. నా ప్ర‌యాణంలో న‌న్ను ప్రేమిస్తూ, నాకు అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్కరికి నా హృద‌య పూర్వ‌క‌ ధ‌న్య‌వాదాలు” అని శృతి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ ద్వారా తెలిపింది. క‌మ‌ల్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు న‌టిగానే కాక సింగ‌ర్‌గా, రైట‌ర్‌గా ప‌లు విభాగాల‌లో త‌న స‌త్తా నిరూపించుకుంది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన లాభం అనే చిత్రం, టాలీవుడ్‌లో రవితేజతో ఒక చిత్రం చేయ‌నుంది. వాటితో పాటు అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శృతి హాస‌న్ కీల‌క పాత్ర ఎంపికైంది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు.

Related posts