కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించి ఏపీ నిర్ణయాలు తీసుకుంటున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై బీజేపీ నేత సుజనా చౌదరి మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెప్పి వారి ఆశీస్సులతోనే ఏపీకి చెందిన ఏ నిర్ణయాన్ని అయినా సీఎం జగన్ తీసుకుంటున్నారన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపాలన ఉండదని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. మోదీ, అమిత్ షా ఆశీస్సులు తీసుకున్నాకే జగన్ ఏ నిర్ణయం అయినా తీసుకుంటారంటే అర్థమేంటని సుజనా చౌదరి ప్రశ్నించారు.