telugu navyamedia
రాజకీయ

నామినేషన్‌ వేసిన అఖిలేష్‌

Akilesh says Meet KCR at Hyderabad
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌  ఈ రోజు నామినేషన్‌న వేశారు. తన నామినేషన్‌ పత్రాలను  ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. అఖిలేష్‌  ఉత్తరప్రదేశ్‌లోని ఆజంఘడ్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ఆజంఘడ్‌ కంచుకోటగా ఉంది.
ఆజంఘడ్‌ స్థానానికి మే 12న ఎన్నికలు జరగనున్నాయి. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడం, ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉండడం తనకు కలిసి వస్తుందని అఖిలేష్‌ ఆజంఘడ్‌ను ఎంపిక చేసుకున్నారు. అఖిలేష్‌ తండ్రి ములాయం సింగ్‌ మెయిన్‌పూరి నుంచి బరిలో ఉన్నారు.

Related posts