telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైల్లో ప్రయాణించే అవకాశం లేదు…

Train Indian railway

ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైల్లో ప్రయాణించే అవకాశం లేద‌ని స్ప‌ష్టం చేసింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే. అస‌లు ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన‌ట్టు జ‌రుగుతోన్న ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని పేర్కొన్నారు.. ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు రైల్వో టీటీఈ దగ్గరకు వెళ్లి టికెట్‌ తీసుకునే అవకాశం లేదని వివరణ ఇచ్చింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే.. కాగా, ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు రైల్వో టీటీఈ దగ్గరకు వెళ్లి టికెట్ తీసుకోవ‌చ్చ‌ని.. త‌ద్వారా వారి గ‌మ్య‌స్థానానికి చేరుకోవ‌చ్చంటూ ప్ర‌చారం జ‌రిగింది.. దీనిపై ఉత్త‌ర్వులు కూడా జారీ చేశారంటూ వార్త‌లు వ‌చ్చాయి.. కానీ, దానిపై క్లారిటీ ఇచ్చిన రైల్వేశాఖ‌.. అస‌లు రైల్వే బోర్డు కానీ, జోనల్‌ రైల్వే ప్రధాన కార్యాలయం కానీ ఇలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని స్ప‌ష్టం చేసింది. దాంతో ఆ పుకార్లకు తెర పడింది.

Related posts