తెలంగాణలోని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పసికందు అపహరణకు గురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన రమాదేవి 15 రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. వైద్య సేవల నిమిత్తం ఆ మహిళా అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు.
ఈ రోజు ఉదయం అయిదున్నర గంటల సమయంలో తల్లికి పాలు లేకపోవడంతో పాలు ఇప్పిస్తానని నమ్మబలికి గుర్తు తెలియని మహిళ పసికందును అపహరించింది. ఎంతటికీ మహిళ తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. అనంతరం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా నిందితురాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.