telugu navyamedia
రాజకీయ

పోలీస్‌ శాఖ ఎంపికలో చిప్‌ సిస్టమ్‌ తొలగించాలి : అభ్యర్థుల డిమాండ్‌

తెలంగాణ  రాష్ట్రంలో  ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు చిప్‌ సిస్టమ్‌ పై ఆందోళన నిర్వహించారు. పోలీస్‌ శాఖ నియామకాల్లో  సెన్సార్‌ చిప్‌ సిస్టమ్‌ను తొలగించాలనిఅభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆందోళన చేపట్టారు. 
రేడియో ఫ్రిక్వేన్సీ ఐడెంటిఫై(ఆర్‌ఎఫ్‌ఐ) సిస్టం ద్వారా ఈవెంట్స్‌ నిర్వహించడం వలన ఇబ్బందులు తలేత్తాయని వారు ఆరోపించారు. ఈవెంట్స్‌లో సెలక్ట్‌ కాని వారిని కూడా తుది పరీక్షకు అనుమతిచ్చారని తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే క్రిమినల్‌ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని  వారు ఆందోళన చెందుతున్నారు.

Related posts