telugu navyamedia
సినిమా వార్తలు

యాక్సిడెంట్ లో “ముత్యాల ముగ్గు” తారలు మృతి

BHargavi-and-Anusha

“ముత్యాల ముగ్గు” సీరియల్ కు సంబంధించిన ఇద్దరు వర్ధమాన తారలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. చేవెళ్ల సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికీ గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తతో టెలివిజన్ యాక్టర్స్, నటీనటులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. బుల్లితెర సీరియల్ “ముత్యాల ముగ్గు” షూటింగ్ కోసం వికారాబాద్ జిల్లాలోని అడవులకు వెళ్ళింది యూనిట్. హైదరాబాద్ నుంచి అనంతగిరి ప్రాంతంలో షూటింగ్ కోసం వెళుతుండగా వీరి కారు హఠాత్తుగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టుకు ఢీకొట్టింది. ఈ కారు ఆక్సిడెంట్ లో “ముత్యాలముగ్గు” సీరియల్ లో నటిస్తున్న భార్గవి, అనూష రెడ్డి అక్కడికక్కడే మరణించారు. భార్గవి నిర్మల్ కు చెందిన యువతిగా, అనూష భూపాల్ పల్లి జయశంకర్ జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కారులోనే ప్రయాణిస్తున్న మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

Related posts