తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 27నుంచి జూన్ 3 వరకు శుభప్రదం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ధర్మప్రచార పరిషత్ అధ్యక్షుడు సీహెచ్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధ్యాత్మిక, నైతిక విలువలు బోధనే ప్రధానంగా శుభప్రద శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7, 8, 9 తరగతులు చదువుతున్న బాల బాలికలకు విడివిడిగా ఎంపికచేసిన కళాశాలల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎంపికైన విద్యార్థులకు రవాణా భత్యం కింద రూ.700 నగదు, ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు గుంటూరు ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో లభిస్తాయన్నారు. ఇతర వివరాలకు సెల్ నం: 99890 23329లో సంప్రదించాలన్నారు.