telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణాలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా : 24 గంటల్లో 5093 కేసులు, 15 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 5093 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 15 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 1555 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,51,424 కు చేరగా.. రికవరీ కేసులు 3,12,563 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1824 మంది మృతి చెందారు.. రికవరీ రేటు దేశంలో 87.2 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 89.88 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 24156 మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.. ఇక, నిన్న ఒకే రోజు 1,29,637 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 1,17,37,753 కు చేరుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Related posts