తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో భ్రమరాంబిక షాపింగ్ మాల్లో చీరల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. పది రూపాయలకే చీర అంటూ షాపింగ్ మాల్ నిర్వాహకులు ఆషాఢం ఆఫర్ను ప్రకటించడంతో మహిళలు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైనాయి.
షాపింగ్ మాల్ నిర్వాహకులు పది రూపాయలకే చీర అందించనున్నట్టు ప్రకటించారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి సైతం మహిళలు భారీగా షాపింగ్ మాల్కు తరలి వచ్చారు. అంతా ఒక్కసారిగా చీరల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి.
అనుమానం అవసరం లేదు.. నూటికి వెయ్యిశాతం టీడీపీ గెలుస్తుంది: చంద్రబాబు