telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్‌ నరసింహన్‌తో జగన్‌ భేటీ

everything is ready for 30th jagan oath

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఈ రోజు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు.

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం వైఎస్‌ఆర్‌సీపీ ఎల్పీ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా నరసింహన్‌కు విజ్ఞప్తి చేస్తారు. అనంతరం ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్‌ కలువనున్నారు.

Related posts