telugu navyamedia
సినిమా వార్తలు

నాగ చైతన్యకు షాకిచ్చిన సాయి పల్లవి

Sai-Pallavi

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల అధికారికంగా పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా విషయమై నేడు ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమా కోసం నాగచైతన్య తీసుకున్న పారితోషకం కంటే సాయి పల్లవి తీసుకునేదే దాదాపుగా రెండింతలు ఉండనుందని టాక్. ఇక రెమ్యూనరేషన్ విషయమై ఇప్పటికే హీరో మరియు హీరోయిన్లను సంప్రదించిన సినిమా నిర్మాతలు, సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ని బట్టి ఆమెకు చైతన్య కంటే భారీ స్థాయిలోనే ముట్టజెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మ్యాటర్ తో కొంత షాక్ కు గురైన నాగచైతన్య, హీరోయిన్ గా ఆమెకున్న రేంజి అటువంటిది కాబట్టే తనకంటే మరింత పెద్ద మొత్తంలో ఆమెకు రెమ్యూనరేషన్ దక్కిందని తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడట. అయితే హీరో గారి కంటే, హీరోయిన్ అత్యధిక స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం అనేది ఆశ్చర్యకరమే అంటున్నారు సినిమా విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందం స్పందించాల్సిందే.

Related posts