బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కియారా అద్వానీ. హిందీలో ఈ భామ “అర్జున్ రెడ్డి” రీమేక్ “కబీర్ సింగ్”లో చేసింది. ఆ సినిమా సక్సెస్తో మంచి ఫాంలో ఉంది కియారా. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వివాదాల మద్య కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. కబీర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. ఈ విజయంతో సూపర్ ఫామ్లో ఉన్న కియారా.. ఈ వివాదాల గురించి.. సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో వస్తున్న లవ్ ఎఫైర్ గురించి స్పందించారు. ఆమె మాట్లాడుతూ… “నేను సిద్ధార్థ్తో డేటింగ్లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదు. నేను సింగిల్గానే ఉన్నాను. కానీ కచ్చితంగా నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అంటూ స్పష్టం చేసింది. ఆ తర్వాత కబీర్ సింగ్ వివాదంపై స్పందిస్తూ.. ‘కబీర్ సింగ్’ సినిమాలో హీరో, హీరోయిన్లు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం గురించి.. ఆమె మాట్లాడుతూ..వారు ‘అలా కొట్టుకోవడం, నోటికొచ్చినట్లు తిట్టుకోవడం నాక్కూడా నచ్చదు. అయితే సినిమా వేరు, నిజ జీవితం వేరు. నా జీవితంలో మాత్రం అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటానని.. అంతేకాదు నాపై నా భర్త చెయ్యిని పడనివ్వను” అని తెలిపింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న “లక్ష్మీబాంబ్” అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది.
previous post
next post