telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దసరా కానుకగా ఆర్ఆర్ఆర్..అధికారిక ప్రకటన వచ్చేసింది

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. అయితే.. ఇవాళ ఈ సినిమా నుంచి లేటేస్ట్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాను 2021 అక్టోబర్‌ 13న రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సినిమా యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో రాంచరణ్‌ గుర్రంపై, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బైక్‌పై ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ను చరణ్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. కాగా.. ఇవాళ మధ్యాహ్నం ఈ మూవీ నుంచి బిగ్గెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Related posts