వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది. ఈ సినిమాకు సెన్సార్ సమస్యతో పాటు పలు వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ పెట్టారు. కానీ ముందుగా ఊహించినట్లుగానే సినిమాకు రాజకీయ సెగ తగిలింది. పలు వివాదాలు చుట్టుముట్టాయి. పలు కారణాల వలన టైటిల్ చేంజ్ చేశారు. నవంబర్ 29న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించగా, సెన్సార్ సమస్యల వలన చిత్రం రిలీజ్కి నోచుకోలేకపోయింది. ఈ సినిమాపై కేఏ పాల్ మండిపడ్డారు. సినిమాని రిలీజ్ చేయోద్దని కోర్టులో పిటీషన్ కూడా వేశారు. అయితే తాజాగా వర్మ కేఏ పాల్ నుండి సెన్సార్ సర్టిఫికెట్ అందుకుంటున్నట్టుగా మార్ఫింగ్ ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ ఫోటోకి నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు.
😎😎😎 pic.twitter.com/rsLYh1PrNP
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2019