telugu navyamedia
సినిమా వార్తలు

రష్మిక పేరెంట్స్ అప్సెట్..!

‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ రష్మిక మందన్నా ప్రస్తుతం యూత్ గుండెల్లో గుడి క‌ట్టుకుంది. ఛ‌లో మూవీతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకు ప‌రిచ‌మైంది. ఆ త‌రువాత వ‌చ్చిన గీతా గోవిందం మూవీలో విజ‌య‌దేవ‌ర కొండ హీరోగా.. రష్మిక హీరోయిన్‌గా తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ యాక్టివ్ గా ఉంటుంది.

కాగా .. త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది. ఆమె తొలి చిత్రం “మిషన్ మజ్ను” విడుదలకు ముందే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో “గుడ్‌బై” అనే మరో హిందీ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసేసింది. తెలుగులో `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు`లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌ల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వస్తుండటంతో నిత్యం షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.

తాజాగా రష్మిక మందన్న మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నేను వరుసగా షూటింగుల్లో పాల్గొనడం అమ్మానాన్నలకు నచ్చడం లేదు. కోవిడ్ -19 ఇంకా ఉన్నందున ప్రాజెక్టుల షూట్‌లను కొన్ని రోజులు వాయిదా వేయమని వారు నాకు చెప్పారు.

నాపై వారికున్న ప్రేమ నన్ను కలచి వేసింది. కానీ షూటింగ్‌లను వాయిదా వేసే నిర్ణయం నా చేతుల్లో లేదు. నేను షూటింగులలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడానికి అదే ప్రధాన కారణం. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లలో పాల్గొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా.. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ లాంటి లెజండరీ వ్యక్తితో క‌లిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.

Related posts