లాక్డౌన్ వలన గత రెండు నెలలుగా థియేటర్స్ అన్నీ మూత పడ్డ సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం సీఎం కేసీఆర్తో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరిపిన తర్వాత థియేటర్స్ రీ ఓపెన్పై కాస్త స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. ఆగస్ట్లో తిరిగి థియేటర్స్ ఓపెన్ అవుతాయనే ఓ ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ముందుగా వచ్చే సినిమా పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” అని అంటున్నారు. దాదాపు రెండేళ్ళ తర్వాత పవన్ తిరిగి మేకప్ వేసుకోగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. “వకీల్ సాబ్” ముందు విడుదలైతే జనాలలోను కాస్త జోష్ వస్తుందని భావించి ఈ సినిమాని ముందుగా రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తుంది. ఆ తర్వాత వి, అరణ్య, నిశ్శబ్దం వంటి బడా చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు ఒక్కొక్కటిగా రానున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది నిర్మాతలు ఓటీటీలని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో విడుదల కానున్న కొన్ని చిత్రాలకి సంబంధించి రిలీజ్ డేట్లు కూడా ప్రకటించారు.
previous post
next post