telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అఖిలపక్ష భేటీలో విజయసాయిరెడ్డికి చేదు అనుభవం

Vijayasai reddy ycp

రేపటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

సమావేశానికి హాజరైన చాలామంది నేతలు విజయసాయిరెడ్డికి క్లాస్ పీకారు. అఖిలపక్ష భేటీలో రాష్ట్రానికి సంబంధించిన, జగన్ జైలు అంశాలను చెప్పేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నించగా పలు పార్టీల నేతలు అడ్డుకున్నారు. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన వేదిక కాదంటూ చురకలు అంటించారు. పార్లమెంట్ స్థాయిలో అఖిలపక్షం ఎందుకు పెడతారో నేర్చుకోవాలని విజయసాయికి హితవు పలికారు. 

Related posts