‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ తీస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ మూవీలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’, లావణ్య త్రిపాఠి ‘మల్లిక’ పాత్రల్లో కనిపించనుండగా.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో అనసూయ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఈపాట లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. పైన పటారం అంటూ సాగుతున్న ఈ పాట.. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో ఉండటంతో… మాస్ అభిమానులకు వెంటనే కనెక్ట్ అయ్యింది. అయితే అల్లు అరవింద్ సమర్పణలో వరస హిట్స్ కొడుతున్న బన్నీ వాసు నిర్మాతగా’ వ్యవరిస్తాన ఈ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
previous post