తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మరోసారి కలిసి పోటీచేస్తే తప్పేంటి అన్న విషయం తెలిసిందే. అయితే దీనికి జనసేన సమాధానం స్పష్టంగా చెప్పింది. తాము ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తున్నట్టు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్పష్టం తెలిపారు. గతంలో పొత్తులతో ఒరిగిందేమీలేదని, ఈ సారి ఖచ్చితంగా ఒంటరి పోరాటంతో తమ బలాన్ని నిరూపించుకుంటామని పవన్ చెప్పారు.
అయితే గత ఎన్నికలలో జనసేన పార్టీ పరోక్షంగా టీడీపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం టీడీపీ పాలన సరిగా లేదని, రాష్ట్రం అన్నివిధాలా నష్టపోతున్నదని భావించిన పవన్ తన మద్దతును ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. కానీ చంద్రబాబు తాజా ప్రకటనతో మరోసారి వీరిద్దరూ కలిసి పోటీచేస్తారని భావించినా, దానిపై పవన్ ఈసారి త్వరగా స్పందించి, తన నిర్ణయాన్ని సుస్పష్టంగా ప్రకటించారు.
సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ